సీఎంఆర్ఎఫ్ పేదలకు ఒక‌ వరం లాంటిది : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలతో ప్రతి ఒక్కరికి‌ లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.20 లక్షల‌ ఆర్థిక‌ సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌అందజేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కి చెందిన కమలాబాయి కి లక్ష రూపాయలు, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన బాదంపూడి అబ్దుల రాజు కి రూ.20 వేల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేదలకు బాసటగా నిలుస్తోందని అన్నారు. ఆపదలో‌ ఉన్న‌ వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బ్రిక్ శ్రీను, కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here