మజీద్ బండలో తెలంగాణ విమోచన దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ మజీద్ బండ వద్ద శుక్రవారం బిజెపి శ్రేణులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రజాకార్ల చేతుల్లో అమాయక ప్రజలు బలయ్యారని, ఎంతో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. నిజాం కబంధహస్తాల నుండి తెలంగాణను విడిపించడానికై అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో నిర్వహించి భారత మిలిటరీ సహాయంతో నిజాం పాలకులు, రజాకార్ల నుండి తెలంగాణ విమోచన కల్పించారన్నారు. కెసిఆర్ కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని గంగాధర్ రెడ్డి తెలిపారు. అనంతరం నిర్మల్ లో జరిగే బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

నిర్మల్ బహిరంగ సభకు బయల్దేరిన బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here