లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, తహసిల్దార్ వంశీ మోహన్, టిఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, బాలింగ్ గౌతమ్ గౌడ్

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి/షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాం చెక్కులను  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భభంగా గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వంశీమోహన్ గిరిదావర్లలు చంద్రా రెడ్డి, మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, గౌతమ్ గౌడ్ , తెరాస నాయకులు తిరుపతి, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here