శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : అల్విన్ కాలనీలో డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జయశంకర్ నగర్ బస్తీలో పర్యటించేందుకు వెళ్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను ప్రజలు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వారి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలుస్తామని ఈ సందర్భంగా ప్రజలు హామీ ఇచ్చారు.

కాలనీ వాసులను స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, మనెపల్లి సాంబశివరావు, శేషు, శిరీషా సత్తుర్, రవి, రఫిక్, కృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here