నల్లగండ్లలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల 33/11కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ దృష్ట్యా తారానగర్ సెక్షన్‌లో అన్ని ఫీడర్లలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లనుందని ఎలక్ట్రికల్ ఏఈ సురేందర్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. నల్లగండ్ల సబ్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామం, లక్ష్మీ విహార్ ఫేజ్1, ఫేజ్ 2, డిఫెన్స్ కాలనీ, నల్లగండ్ల హుడా, అపర్ణ సరోవర్, సిటిజన్ హాస్పిటల్, జవహర్ నవోదయ కాలనీ, సాయిరాం కాలనీ లో విద్యుత్ సరఫరా అంతరాయం కలగనుందన్నారు. సంబంధిత‌ కాలనీల ప్రజలు గమనించి సహకరించగలరని ఏఈ విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here