మాదాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. బిఆర్ఎస్ లో చేరికలు

  • బీజేపీ సీనియర్ నాయకుడు జంగయ్య యాదవ్, ఆయన అనుచరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ కాలనీ చెందిన రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్ , ఆయన అనుచరగణం బిఆర్ ఎస్ లో చేరారు. మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా..ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్ కు లో కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని తెలిపారు.  ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్, ఆయన అనుచరులతో..

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులలో రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ జనరల్ సెక్రటరీ జంగయ్య యాదవ్, చరణ్ యాదవ్ వారి అనుచరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, బృందరావు, రాంచందర్, యాదమ్మ, సత్యారెడ్డి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here