అభివృద్ధికి పాటుపడే బిఆర్ఎస్ అభ్యర్థి గాంధీకే ఓటెయ్యండి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ, అభయాంజనేయ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మియాపూర్ డివిజన్  కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీగా వెళుతున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని డైనామిక్ కాలనీ, అభయాంజనేయ కాలనీలలో ప్రజలకు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనామిక్ కాలనీ, అభయాంజనేయ కాలనీలలో ఇంటింటి ప్రచారం చేపట్టామని, ప్రజలనుంచి మంచి స్పందన ఉందని, మళ్లీ గాంధీకే తమ మద్దతు అంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం సేవచేసిన నాయకుడని, మియాపూర్ డివిజన్ పరిధిలో సుమారు రూ 100.కోట్లకు పైగా నిధులు వెచ్చించి డివిజన్ లోని అన్ని కాలనీలలో సౌకర్యవంతమైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీలు, వరద కాలువలు, పార్కులు వంటి ఎన్నో మౌలిక వసతులను కల్పించారని తద్వారా ప్రజలకు ఎంతో సౌలభ్యం లభించిందన్నారు. అభివృద్ధికి పాటుపడే గాంధీకే, మరోమారు ఓటు వేసి గెలిపించి ఓటుతో మూడోసారి విజయాన్ని అందించాలని కోరారు.

మియాపూర్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే గాంధీకి ఓటేయాలని కోరుతూ కరపత్రాలు అందజేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here