చెరువుల సుందరీకరణకు కృషిచేస్తున్నాం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : స్థానిక నియోజకవర్గంలోని చెరువుల సుందరీకరణకు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని , చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులు వేగం పెంచాలని, చెరువు కట్ట పునరుద్ధరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే గాంధీ ఆదేశించారు.

ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించేందుకు పాదయాత్రగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, సాయివైభవ్ కాలనీ వాసులు పద్మ, అశోక్ రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here