ఆలయాల సందర్శనతో మానసిక ప్రశాంతత – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సందర్శించారు. నూతన ఆలయంలో శివలింగంను వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టించారు‌. ఆలయాలను సందర్శించి, దైవ పూజ చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంత అలవడుతుందని అన్నారు. ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here