అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించండి – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపన్ పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం పనుల్లో నాణ్యత పాటించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రంగస్వామి, మధు, మురగ నర్సింగ్ రావు, సాయి, గోపన్ పల్లి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గోపన్ పల్లిలో యూజీడీ పనులను పరిశీలిస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here