దీప్తీలో వ‌ర‌ద‌నీటీ కాలువ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

వ‌ర‌దీనీటి కాలువ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని దీప్తీశ్రీన‌గ‌ర్ కాల‌నీలో రూ. 20 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేప‌డుతున్న వ‌ర‌ద‌నీటి కాలువ పనులను స్థానిక కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో వర్షం పడినప్పుడు వర్షపు నీరు పోక బాటసారులు మరియు వాహదారులు ఇబ్బంది పడుతున్నారి, కాలనీ వాసుల కోరిక మేరకు సమస్యను పరిష్కరిస్తున్నామ‌ని అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల‌కు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు గౌస్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here