- డీసీ వంశీ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ సమస్యపై ఫిర్యాదు చేసిన సమస్యను పరిష్కరించడం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-30-at-8.02.19-PM.jpeg)
వివరాలు.. చందానగర్ డివిజన్ వేముకుంట వేణుగోపాలస్వామి ఆలయం మసీద్ రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఏర్పడగా అధికారులు సీసీ రోడ్డు తవ్వి పైపులైన్ వేసి మళ్లీ రోడ్డు వేయకుండా వదిలేశారని, అనంతరం అదే మట్టితో ఆ గుంతను పూడ్చివేయడంతో ఆ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చందానగర్ సర్కిల్ 21 కార్యాలయంలో డీసీ వంశీ కృష్ణకు దొంతి కార్తీక్ గౌడ్ శనివారం వినతి పత్రం సమర్పించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-30-at-8.02.20-PM-1.jpeg)
తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.