దళిత రత్న అవార్డుల ప్రదానం

నమస్తే శేరిలింగంపల్లి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గణపురం రవీందర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం స్టేట్ మహిళా ఉపాధ్యక్షురాలు మల్లెల జయలకు దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డు ను ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ రాగం నాగేందర్ యాదవ్ కి కృతజ్ఞతగా వారి వార్డ్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో వెంకటమ్మ, లక్ష్మి, నిరూప, తులసి, సుబద్ర, దివ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

దళిత రత్న అవార్డులు పొందిన వారితో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here