శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామం లో మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ లో భాగంగా‌ బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. అపర్ణ ధూళిపాళ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణపతి శ్లోకం, జతిస్వరం, ప్రవేశ దరువు-భామ, దశావతార శబ్దం, అన్నమాచార్య కీర్తన-కులుకాగా, అన్నమాచార్య కీర్తన – అలరులు, తిల్లాన అంశాలను అపర్ణ, ఆరుషి, యామిని, యాషికా ప్రదర్శించి మెప్పించారు. భరత నాట్య ప్రదర్శనను రాధా రాణి శిష్య బృందం ప్రదర్శించారు. భరతనాట్య ప్రదర్శన లో భాగంగా పుష్పాంజలి, గణేశా వందనం, సాయి పంచరత్నం, తంబుర మీటేదవ- పురందర దాస కీర్తన, భాగ్యదా లక్ష్మి, భజగోవిందం, వేంకటాచల నిలయం, మంగళం అంశాలపై కళాకారులు అర్షిత ,తనుశ్రీ, శ్రీత శర్మ, వర్షిణి, వర్షిత, హారిక, వాసవి ప్రియా కళాకారులు ప్రదర్శించారు.

శిల్పారామంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here