విధి నిర్వ‌హ‌ణ నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన మ‌హిళ అదృశ్యం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విధులు నిర్వ‌హించేందుకు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఓ వివాహిత అదృశ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

జ్యోతి (ఫైల్‌)

చందాన‌గ‌ర్‌లోని న్యూ శంక‌ర్ న‌గ‌ర్‌లో ఉన్న సుశీల అపార్ట్‌మెంట్ ప్లాట్ నం.205లో చెల్ల‌ప్ప‌న్ సంజీవ్ త‌న భార్య జ్యోతి (35), కుమారుడితో క‌లిసి జీవిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. వీరు గ‌త 15 రోజుల కింద నుంచి చందాన‌గ‌ర్‌లోని భ‌వానిపురంలో ఉన్న జ్యోతి త‌ల్లి ఇంట్లో ఉంటున్నారు. కాగా జ్యోతి ఆన్‌లైన్ స‌ర్వే పేరిట విధులు నిర్వ‌ర్తిస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈ నెల 11న ఉద‌యం 10 గంట‌ల‌కు య‌థావిధిగా విధి నిర్వ‌హ‌ణ‌కు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఆమె భ‌ర్త సంజీవ్ ఆమెకు ఫోన్ చేశాడు. కానీ త‌రువాత ఫోన్ చేస్తే స్విచాఫ్ వ‌చ్చింది. అనంత‌రం ఆమె ఇంటికి రాలేదు.

దీంతో జ్యోతి కోసం సంజీవ్ అన్ని చోట్లా గాలించాడు. అయిన‌ప్పటికీ ఆమె ఆచూకీ తెలియ‌లేదు. దీంతో అత‌ను చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here