మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ జేపీ నగర్లో నివాసం ఉండే ఆర్యూ భాస్కర్ రావు భార్య ఆర్.మధులత (54) సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఫోన్ను ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆమె కుటుంబ సభ్యులు వాకబు చేశారు. అయినా ఆమె జాడ తెలియకపోవడంతో వారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.