
హఫీజ్ పేట(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని మదీనగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆమె పరిశీలించారు. అనంతరం వైశాలి ఎనక్లేవ్ నందు నూతనంగా నిర్మించాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. డివిజన్ సమస్యలను గుర్తించగానే పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. .ఈ పర్యటనలో డీఈ చిన్నారెడ్డి, ఏ.ఈ అనురాగ్, బాలరాజు యాదవ్,ఆంజనేయులు యాదవ్,జనార్దన్ గౌడ్,సాయి యాదవ్,వెంకటేష్,శిరీష్,ప్రశాంత్,వర్క్ ఇంస్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు