గిరిజ మార్వెల్ అపార్టుమెంట్ కు లింక్ రోడ్లను ఏర్పాటు చేయండి: కార్పొరేటర్ నవతరెడ్డి

చందానగర్ గిరిజ మర్వెల్ వద్ద అధికారులతో చర్చిస్తున్న కార్పొరేటర్ నవతరెడ్డి

చందానగర్: చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎనక్లేవ్ కాలనీ(గిరిజ మర్వెల్) నుండి లింకు రోడ్లను ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ నవతరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కాలనీలో పర్యటించిన ఆమె పలు సూచనలు చేశారు. గిరిజ మర్వెల్ నుండి అపర్ణ లింక్ రోడ్ కు, మరోవైపు అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ కి లింక్ రోడ్ ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా శిల్ప ఎన్ క్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ వాసులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు లింకు రోడ్ల ద్వారా జాతీయరహదరిని సులువుగా చేరుకుంటారని తెలిపారు. ఈ పర్యటనలో సిపి శ్రీనివాస్ రావు, ఏసీపీ సంపత్ లతో పాటు అధికారులు, కాలనీవాసులు ఉన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here