ఎంసిపిఐయూ ప్రధాన కార్యదర్శి గౌస్ మరణం ప్రజా ఉద్యమలకు తీరని లోటు: తాండ్ర కుమార్

నమస్తే శేరిలింగంపల్లి:  ఎంసిపిఐయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గౌస్ ఆకస్మిక మరణం జాతీయ ప్రజా ఉద్యమాలకు, వామపక్షాల ఐక్యతకు, ఎంసిపిఐ యు పార్టీకి తీరని లోటు అని పార్టీ తెలంగాణ కార్యదర్శి తాండ్రకుమార్ అన్నారు. కామ్రేడ్ గౌస్ ఈనెల 11వ తేదీన విపరీతమైన జ్వరంతో కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆసుపత్రిలో చేరి సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఆయన గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారని దీనికితోడు కరోనా సోకడంతో ఊపిరితిత్తులు మరింత క్షీణించడంతో మృతి చెందారని తెలిపారు ఆయన మరణానికి ఎంసిపిఐయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు.
  

ఎంసిపిఐయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గౌస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here