ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా రూ. 3 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అని పేర్కొన్నారు.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన నఫీజ్ బేగం కు రూ. 2 లక్షల 50 వేలు, పాపిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పాశం నాగిరెడ్డికి రూ 1 లక్ష మంజూరైనట్లు తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు అబీబ్ బాయ్, జంగం గౌడ్, సంగారెడ్డి, కాశినాథ్ యాదవ్, శేఖర్ గౌడ్, యోగి పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలను బాధిత కుటుంబాలకి కార్పొరేటర్లతో కలిసి అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here