నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ లో సిసిరోడ్డు పనులను కాలనీ వాసులు, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిరోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిసిరోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.