సాయి ఐశ్వర్య కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు

  • పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య కాలనీలో రూ.30 లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు ను నిర్మిస్తున్నారు. ఈ పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పనుల్లో నాణ్యత కొరవడద్దని, నిర్ణీత సమయంలో సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సాయి ఐశ్వర్య కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, సాయి ఐశ్వర్య కాలనీ వాసులుప్రభాకర్ రెడ్డి, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.

సాయి ఐశ్వర్య కాలనీలో సీసీ రోడ్డు పనులను కాలనీవాసులతో కలిసి పరిశీలిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
సీసీ రోడ్డు పనుల పరిశీలన అనంతరం కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here