బ్లడ్ టు లీవ్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ లో రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలివేముల వీరేశం గౌడ్, బ్లడ్ టూ లీవ్ నిర్వాహకుడు పట్టు పోగుల ప్రవీణ్ కుమార్

హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): బ్లడ్ టు లీవ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పట్టు పోగుల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం హైదర్ నగర్ లోని హోలిస్టిక్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు కలి వేముల వీరేశం గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న బ్లడ్ టూ లీవ్ సంస్థ నిర్వాహకులు పట్టుపురుగుల ప్రవీణ్ కుమార్ ను అభినందించారు. యువత ప్రవీణ్ కుమార్ కు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రక్తదానానికి మించిన సేవ మరొకటి లేదని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here