కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి స‌న్మానం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డిని చందాన‌గ‌ర్ హౌజ్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ సభ్యులతో కలిసి అధ్యక్షుడు తుడి ప్రవీణ్  ఆదివారం ఘనంగా స‌న్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు ఆమెను పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోర‌గా అందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్రమంలో అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ తుడి,  ఉపాధ్య‌క్షుడు మ‌హేష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాణిక్యాల రావు, కార్య‌నిర్వాహక కార్య‌ద‌ర్శి అంజ‌ద్‌, స‌భ్యులు స‌ద‌య్య‌, స‌లీం, సుబ్బారావు, సూరిబాబు, విజ‌య్‌, స‌తీష్ పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న చందాన‌గ‌ర్ హౌజ్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ప్రవీణ్ 
కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డితో చందాన‌గ‌ర్ హౌజ్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here