ఓ బి సి బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కలెక్టర్ కు వినతి

కలెక్టర్ కు వినతిపత్రం సమర్పిస్తున్న భేరీ రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ఓబీసీ రిజర్వేషన్లు అమలు అంశంపై బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ కోరారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ను కలిసిన నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ ఓబీసీలకు రిజర్వేషన్లు లభించక అన్ని రంగాల్లో వెనకబడుతున్నారని తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జింకల యాదయ్య యాదవ్, గడ్డమీది ఆంజనేయ యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here