మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని, అందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వరగౌడ్ అన్నారు. శనివారం మియాపూర్ జనప్రియ ఫేజ్-1 కమాన్ వద్ద డ్రైనేజి పొంగి రోడ్డుపై పారుతుండటం గమనించిన ఆయన సర్కిల్ అధికారులను సంప్రదించారు. సర్కిల్ డిప్యూటీ కమీషనర్, ఈఈ, ఏఈ లను సంప్రదించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.