మహానేత ఎన్టీఆర్ ను మరవలేము: కొండా విశ్వేష్వర్ రెడ్డి

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కొండా విశ్వేష్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్, కొడాలి రవికుమార్

హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్, టీడీపి నాయకుల పాదయాత్ర

హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేష్వర్ రెడ్డి శనివారం హైదర్ నగర్ డివిజన్ లో పర్యటించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎం. రవి కుమార్ యాదవ్ నేతృత్వంలో స్థానిక టీడీపి నాయకులతో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ గారు హైదర్ నగర్ డివిజన్ దత్తత తీసుకున్న హైదర్ నగర్ డివిజన్ లో ఏం ఓరగా పెట్టారని ప్రశ్నించారు. డివిజన్ లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నదని మండిపడ్డారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొడాలి రవికుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది ఒక్క ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపి నాయకులు చండ్ర వెంకటేశ్వరరావు , సీతారామయ్య , వేణు, సోను, కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస రావు, సీతారామరాజు, రవి కిరణ్, బాలయ్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here