శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): కార్మిక కర్షక శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు చోట్ల ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన INTUC జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు దాగి ఉందన్నారు. అనంతరం మసీద్ బండలోని నివాసంలో లింగంపల్లి ఆటో స్టాండ్ నాయకుడు ఆలీకి నూతన ఆటో ను అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ మాట్లాడుతూ బల్దియా, ఆటో కార్మికులకు అండగా ఉంటూ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ యాదవ్, డివిజన్ సెక్రటరీ ఎండి. అజామ్, ఐవైసీ డివిజన్ ప్రెసిడెంట్ కొడిచర్ల మహేందర్ , NSUI నాయకులు అశోక్, గోపాల్ , ఎండీ ఇమ్రాన్, నాగరాజ్, విజయ్, ఆకాష్, రోహిత్ గౌడ్, లావణ్ , డేవిడ్ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.






