శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ ప్రజాసిటీ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందిన నాగేశ్వరరావు, ప్యానల్ లో గెలుపొందిన సభ్యులందరికీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ అభినందనలు తెలిపారు. అనంతరం కాలనీ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.






