శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి నల్లగండ్ల ఫ్లై ఓవర్ వద్ద మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ పర్యవేక్షణలో సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ పేరిట శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.






