శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న అల్ జమల్ అల్ హరిరీ మసీద్ వద్ద జరిగిన ఈద్ కా తోఫా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొని ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వహీద్ ఖాన్, సలీం, మజారుద్దీన్, ఫెరోజ్, సమీర్, అబ్బాస్, మతీన్, అసఘర్, యాకుబ్, నవీద్, మునీర్ ఖాన్, యాకుబ్, ఇక్బాల్, జాఫర్ అలీ, సలీం భాయ్, అజ్మాత్, మొహ్మద్ వసీం తదితరులు పాల్గొన్నారు.






