శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాత్రో ఆధ్వర్యంలో ఇంజనీర్ ఎన్ క్లేవ్ లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు , బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ , బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు, బీజేపీ నాయకులు నరసింహ ముదిరాజ్ , నారాయణ , మల్లేశం , వికాస్ , ఆశిష్ , రంజిత్ , సత్యప్రకాష్ , శ్రీధర్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






