శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ సీనియర్ నాయకుడు అజిత్ సేనాపతి కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ సీనియర్ నాయకుడు అజిత్ సేనాపతి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా ఉండటమే కాకుండా, ఆయన మనందరికీ నిజమైన ప్రేరణ, ఆయన ఆశీర్వాదాలు పొందడం తనకు గౌరవంగా ఉందన్నారు. తమ చర్చ చాలా సానుకూలంగా, అంతర్దృష్టితో కూడుకున్నదని, ఇంత గొప్ప మార్గదర్శకత్వంలో పార్టీ లక్ష్యం కోసం మరింత కష్టపడి పనిచేయాలని ఎదురుచూస్తున్నానని అన్నారు.






