శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బస్ బాడీ యూనిట్ వద్ద ఉన్న శ్రీ కాళిమాత ఆలయ పూజారి సందీప్, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యుడు శ్రవణ్ కుమార్ (శ్రవణ్ నాయుడు ) పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ దళిత మహిళ, ఆమె భర్తపై వారు దాడి చేశారని బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పూజారి సందీప్, శ్రవణ్ కుమార్ లపై మియాపూర్ పోలీసులు FIR నమోదు చేశారు.






