శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ గచ్చిబౌలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ కేర్ ఫార్మసీ మెడికల్ షాపును కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా సిటీ కేర్ ఫార్మసీ మెడికల్ షాపు యాజమాన్యం సమీర్ అలీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్, సీనియర్ నాయకులు బిక్షపతి, దీపక్, రంగారావు, శ్రీకాంత్, బాలాజీ, రాము, ఫరాన్ తదితరులు పాల్గొన్నారు.






