శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గం మియాపూర్ డివిజన్ నాగార్జున ఎన్ క్లేవ్ కాలనీ బ్లూ స్టార్ రోడ్డులో ఉన్న ఆశ్రీసొసైటీ ఆశ్రమంలో ముద్దంగుల గిరి, అనిత దంపతుల కుమార్తె శ్రీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆశ్రమానికి వారి కుటుంబం తరపున ఫ్రూట్ మిక్సీ గ్రైండర్, ఇతర సామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దంగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






