శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతికాలనీలో వీధిదీపాలు (స్ట్రీట్ లైట్స్) సమస్యలను పరిష్కరిస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ విజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో నూతన వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్) ను అమరుస్తున్న పనితీరును GHMC ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలలో విడతల వారీగా నూతన విధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) ను ఏర్పాటు చేస్తామని, కాలనీల వారీగా నూతన వీధి దీపాలు అమర్చడం జరుగుతుందని, ప్రతి కాలనీలో పనిచేయని వీధి దీపాలను పునరుద్ధరిస్తూ వీధి దీపాలను అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ విభాగం డిఈ లక్ష్మీప్రియ, స్ట్రీట్ లైట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు లక్ష్మణ్, జితేందర్, కుమార్, మహమ్మద్ ఖాజా, రాజు, లక్ష్మణ్, ఖాజా, కల్పన, షఫీ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.