శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో ఆలయ ప్రధాన అర్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో సాయి బృందావనం క్షేత్రం 15వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. పూజ, హోమం, అర్చనలు, భజన కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని అర్చనలు చేయిస్తూ సంతోషంగా కాలనీవాసులు దేవాలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు. నేతాజీ నగర్ గుల్ మోహర్ పార్క్, డాక్టర్స్ కాలనీ, చుట్టుపక్కల కాలనీ వాసులు పాల్గొని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నరసింహ, ఆగమయ్య గౌడ్, యాకయ్య గౌడ్, కుటుంబ సభ్యులు, కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, యోగా గురువు గారెల వెంకటేష్ ముదిరాజు, నాగేష్ నాయక్, ఎన్ ఎన్ రెడ్డి, టెక్స్టైల్స్ బోటిక్ యజమాని కుషన్ రెడ్డి, నారాయణ, లలిత పాల్గొన్నారు.