శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన CSB బ్యాంక్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ CSB బ్యాంకు కొత్త బ్రాంచ్ ను ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇక్కడి ప్రాంత వాసులకు ఎంతగానో తోడ్పడుతుందని ,వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు పనిచేసి వారి మన్ననలు పొందాలని , వినియోగదారులు దేవుళ్ళతో సమానం కావున వినియోగదారులకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొంది మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, గణేష్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.