కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస పార్టీ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్ తన నామినేషన్ పత్రాలను శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు. గత ఐదు సంవత్సరాలుగా కొండాపూర్ డివిజన్ లో చేసిన అభివృద్ధే తమకు అఖండ విజయాన్ని అందిస్తుందని హమీద్ పటేల్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి చేసిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.