శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ప్రశాంత్ నగర్ లో 117 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి, సురేష్, నారాయణ, సుకల్, సాయిలు తదితరులు హాజరయ్యారు.