శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకుడు, రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ కోశాధికారి రమేష్ సోమిశెట్టి అకాల మరణం విషాదకరమని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. పార్టీకి అందించిన ఎనలేని సేవలకు గుర్తుగా రమేష్ పార్థివ దేహాన్ని భారతీయ జనతా పార్టీ జెండాతో సత్కరించి నివాళులర్పించారు. రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు రవికుమార్ యాదవ్ తెలిపారు.