సైబ‌ర్ మోస‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి: సీపీ వీసీ స‌జ్జ‌నార్

  • ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేసిన పోలీసులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది

సైబ‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబ‌ర్ మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ అన్నారు. మంగ‌ళ‌వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ముహ్ బంద్ ర‌ఖో కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌లు సైబ‌ర్ మోస‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ వ్య‌క్తిగ‌త‌, విలువైన స‌మాచారాన్ని అప‌రిచిత వ్య‌క్తుల‌కు చెప్ప‌కూడ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ బ్యాంకింగ్ వివ‌రాల‌ను ఇత‌రులు ఎవ‌రికీ షేర్ చేయ‌రాద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌తినిధుల‌ను సీపీ ఈ సంద‌ర్బంగా అభినందించారు.

ముహ్ బంద్ ర‌ఖో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సీపీ వీసీ స‌జ్జ‌నార్, చిత్రంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌తినిధులు

కాగా ఈ కార్య‌క్ర‌మం ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో రానున్న 4 నెలల్లో ప్ర‌జ‌ల‌కు సైబ‌ర్ మోసాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ప్ర‌తినిధులు 1వేయి వ‌ర‌కు వ‌ర్క్ షాప్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్రాడ్ అవేర్‌నెస్ వీక్ 2020కి మ‌ద్ద‌తుగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని హెచ్‌డీఎఫ్‌సీ ప్ర‌తినిధులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో హెచ్‌డీఎఫ్‌సీ జోన‌ల్ హెడ్స్‌ ఆర్‌వీజీ కుల‌క‌ర్ణి, దేవ‌రాజ్ గుప్తా, రీజిన‌ల్ హెడ్ జి.అర‌వింద్‌, క్ల‌స్ట‌ర్ హెడ్ తాజుద్దీన్ మ‌సూద్‌, సిబ్బంది సోమ శేఖ‌ర్ రావు, సాయి ఉద‌య్ కుమార్‌, శ్ర‌మిష్ట‌, గాయ‌త్రి దేవుల‌ప‌ల్లి పాల్గొన్నారు.

ముహ్ బంద్ ర‌ఖో కార్య‌క్ర‌మాన్ని తెలియ‌జేస్తున్న పోస్ట‌ర్

ఈ సంద‌ర్భంగా పోలీసులు, బ్యాంక్ సిబ్బంది సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెబుతూ ప‌లు సూచ‌న‌లు జారీ చేశారు.

* ఫోన్ ద్వారా అపరిచిత వ్య‌క్తుల‌కు సున్నిత‌మైన స‌మాచారాన్ని చెప్ప‌కూడ‌దు.
* సోష‌ల్ మీడియా లేదా ఇత‌ర యాప్స్ ద్వారా వ‌చ్చే లింక్‌ల‌ను క్లిక్ చేయ‌రాదు.
* బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వారి స‌మాచారం తెలియ‌జేయాల‌ని ఎన్న‌డూ అడ‌గ‌వు.
* స్కీంలు, గిఫ్ట్‌లు, రివార్డులను ఎవ‌రూ ఉచితంగా ఇవ్వ‌రు. దాని వెనుక దురుద్దేశం ఉంటుంది.
* ఇత‌రుల‌కు బ్యాంక్ కార్డుల‌కు చెందిన నంబ‌ర్లు, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీలు, ఓటీపీలు, యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్‌లు చెప్ప‌కూడ‌దు. ఫోన్ ద్వారా, మెయిల్‌, మెసేజ్ ల ద్వారా కూడా ఈ స‌మాచారాన్ని ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌దు.
* యూపీఐ యాప్స్‌కు చెందిన పిన్ నంబ‌ర్లు, బ్యాంక్ లాగిన్ క‌స్ట‌మ‌ర్ ఐడీలు చెప్ప‌కూడ‌దు.
* క‌స్ట‌మ‌ర్లు అడ్ర‌స్, కాంటాక్ట్ నంబ‌ర్ల‌ను మారిస్తే వెంట‌నే బ్యాంక్ వ‌ద్ద‌కు వెళ్లి ఆయా వివ‌రాల‌ను మార్పించుకోవాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here