స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కొత్త‌గూడ విలేజ్ వాసుల విన‌తి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కొత్తగూడ‌ విలేజ్ వాసులు మాట్లాడుతూ కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డు ను వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కొత్తగూడ‌ విలేజ్ లో పర్యటిస్తానని, కొత్తగూడ‌లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ వాసులు ఉట్ల దశరథ్, ప్రసాద్,కృష్ణ, శ్రీనివాస్, నరేష్, శ్రీహరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి విన‌తిప‌త్రం అందజేస్తున్న కొత్త‌గూడ విలేజ్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here