ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపడుతాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డీఈ విశాలాక్షి, కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. కాలనీలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌలిక‌ వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాణ్యత‌ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపనపల్లి గ్రామం వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు రాజు నాయక్, శేఖర్, రంగస్వామి, మురుగ, పల్లపు చంద్రమౌళి, నరసింహ, చిన్నా, విక్రమ్ స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here