లక్నో మున్సిపల్ కమిషనర్ తో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి భేటీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లక్నో మున్సిపల్ కమిషనర్ తో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి అమలు చేయగల అభివృద్ధి పనులపై చర్చ నిర్వ‌హించారు. లక్నో నగరంలో ఉన్న సాఫల్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి విధానాలను పరిశీలించి వాటిని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎలా అమలు చేయవచ్చోనని అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం నిర్వహణ, శునక నియంత్రణ, రహదారుల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ నిర్వ‌హించారు. ఈ అవగాహనతో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపకల్పన చేయబడుతుందని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.

స‌మావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here