బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదులో కార్య‌క‌ర్త‌లు చురుగ్గా పాల్గొనాలి: రాధాకృష్ణ యాద‌వ్

మాదాపూర్, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ ప‌రిధిలోని మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్కులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్య‌క్ర‌మాన్ని డివిజ‌న్ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాధాకృష్ణ యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు బిజెపి గొప్పతనాన్ని, నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభను తన మాటల్లో వివరించి, ఈ ప్రాంతం నుంచి క‌చ్చితంగా 2000కి పైగా సభ్యత్వాలు నమోదు చేయించగలిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న బీజేపీ నాయ‌కులు

దానికి అనుగుణంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపిని బలోపేతం చేసే విషయంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ యాదవ్ స్వయంగా డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ద్వారా కాలనీ వాసులను, స్థానికులను కలుస్తూ పలు సభ్యత్వాలు నమోదు చేయించి ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజ‌న్ నాయకులు సూర్ణ శ్రీశైలం కురుమ, రంజిత్ కుమార్, మహేష్ రవ్వ, సత్యనారాయణ, అల్లాడి ప్రవీణ్, ముఖేష్, వంశీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న రాధాకృష్ణ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here