నమస్తే శేరిలింగంపల్లి : ఒరిస్సాలోని కళింగ స్టేడియంలో జనవరి 2 నుంచి 5 వరకు సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లు జరిగాయి.

ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అరుణ బుడ్డారెడ్డి సత్తా చాటింది. గత డిసెంబర్ లో అరుణకి నాల్గవ ఏసీఎల్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత తను ప్రస్తుతం సత్తా చాటి రజత పతకాన్ని గెలుచుకుంది.






