ఎన్ఎస్ యూఐ నాయకులపై‌ పోలీసుల దాడి‌ హేయమైన చర్య – మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పరామర్శించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: జేఎన్టీయూహెచ్ ముందు నిరసన తెలుపుతున్న ఎన్ఎస్ యూఐ నాయకులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ‌సీనియర్ నాయకులు ఎండీ జమీర్, ఇలియాస్ షరీప్, దుర్గం శ్రీహరి, అభిషేక్ బొబ్బిలి అన్నారు. జేఎన్టీయూహెచ్ ఎదుట ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు నిరసన తెలుపుతుంటే పోలీసులు భౌతిక దాడి చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో పాటు అతని బృందం సభ్యులను మియాపూర్ ‌పోలీస్ స్టేషన్ కు తరలించారనే‌ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ‌కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

మియాపూర్ ‌పోలీస్ స్టేషన్ వద్ద ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శిస్తున్న కాంగ్రెస్ శేరిలింగంపల్లి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here