నమస్తే శేరిలింగంపల్లి: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ కాలనీ ప్రజలు బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా కాలనీ నుండి బిజెపిలోకి చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖేష్, వెంకటేష్, అభిషేక్, అజయ్, సంతోష్, సతీష్, గురు, శశి, వినోద్ యాదవ్, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.